- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమితులై,మొదటిసారిగా మంథని నియోజకవర్గoలోని మల్హర్ రావు మండలానికి సోమవారం విచ్చేసిన దుద్దిళ్ల శ్రీనుబాబుకు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బడితేల రాజయ్య ఆధ్వర్యంలో కొయ్యుర్ లో ఘన స్వాగతం పలికారు. నాగులమ్మ నుంచి కొండంపేట, గంగారం ఎక్స్ రోడ్డు వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో భూపాలపల్లి జిల్లా,మండల కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, యూత్ నాయకులు, మహిళ నాయకురాళ్లు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
- Advertisement -