నవతెలంగాణ – గోవిందరావుపేట : తాడ్వాయి ప్రాజెక్టు పరిధి లోని పసర సెక్టార్లో వడ్డెర గూడెం అంగన్వాడి కేంద్రంలో మంగళవారం అమ్మ మాట అంగన్వాడి బాట కార్యక్రమం నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమంలో భాగంగా ఈసీసీ డే నిర్వహించి అంగన్వాడీ కేంద్రాల ద్వారా పిల్లలకు అందించే ప్రీస్కూల్ విద్య యొక్క ప్రాముఖ్యత గురించి, ప్రీ స్కూల్ పుస్తకాలు, ప్రీస్కూల్ అభివృద్ధి కార్డులు ప్రదర్శించి తల్లులకు అవగాహన కల్పించడం జరిగింది. మూడు సంవత్సరాలు నిండిన పిల్లలందరినీ అంగన్వాడీ కేంద్రంలో నమోదు చేసుకోవాలని, అంగన్వాడి సేవలు ఉపయోగించుకోవాలని, తెలియజేయడమైనది. అంగన్వాడీ కేంద్రంలో ఉండే ప్రీస్కూల్ మెటీరియల్ను డిస్ప్లే చేయడం, మరియు పిల్లలకు నేర్పించే విధానంపై అవగాహన కల్పించనైనది. అక్షరాభ్యాసాలు నిర్వహించనైనది. అంగన్వాడీ కేంద్రంలో నిర్వహించే మంచి అలవాట్లపై అవగాహన కల్పించనైనది ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ ఆర్.శారద, డాక్టర్.విక్రం, ఏ ఎన్ ఎం ఎస్ షాస్ , అంగన్వాడి టీచర్లు భాగ్యమ్మ, పద్మరాణి, సరిత ,పద్మావతి, హెల్పర్ కల్పన మరియు తల్లులు పాల్గొన్నారు
వడ్డెరగూడెంలో అమ్మమాట అంగన్వాడి బాట
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES