తాసిల్దార్, డిప్యూటీ తాసిల్దార్,
నవతెలంగాణ – మద్నూర్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భూ సమస్యల పరిష్కారం కోసం భూభారతి భూ హక్కుల చట్టాన్ని తీసుకువచ్చిందని తాసిల్దార్ ఎండి ముజీబ్, డిప్యూటీ తాసిల్దార్ శివరామకృష్ణ తెలిపారు. భూభారతి రెవెన్యూ సదస్సులో భాగంగా రెవెన్యూ అధికారులు మంగళవారం మద్నూర్ మండలంలోని గోజేగావ్ గ్రామపంచాయతీ పరిధిలోని గోజేగావ్, సోనాల, గ్రామాల్లో రెవిన్యూ సదస్సులు నిర్వహించినట్లు తెలిపారు. గోజేగావ్ లో డిప్యూటీ తాసిల్దార్ శివరామకృష్ణ ఆర్ శంకర్ ఆధ్వర్యంలో ఈ రెవెన్యూ సదస్సులు నిర్వహించగా.. అక్కడ ఆరు సమస్యలకు దరఖాస్తులు వచ్చినట్లు డిప్యూటీ తాసిల్దార్ తెలిపారు. సోనాల గ్రామంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో తాసిల్దార్ ఎండి ముజీబ్ పాల్గొన్నారు. ఇక్కడ 10 దరఖాస్తులు భూ సమస్యల పరిష్కారానికి వచ్చినట్లు తాసిల్దార్ తెలిపారు. భూభారతి రెవెన్యూ సదస్సుకు రెండు గ్రామాల్లో కలిసి 16 దరఖాస్తులు వచ్చినట్లు రెవెన్యూ అధికారులు తెలిపారు .
భూ సమస్యల పరిష్కారం కోసమే భూభారతి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES