Wednesday, June 18, 2025
E-PAPER
Homeఖమ్మంఅశ్వారావుపేట కాంప్లెక్సు లో సమ్మిళిత విద్యా దినోత్సవం 

అశ్వారావుపేట కాంప్లెక్సు లో సమ్మిళిత విద్యా దినోత్సవం 

- Advertisement -

నవతెలంగాణ – అశ్వారావుపేట
బడిబాటలో భాగంగా అశ్వారావుపేట కాంప్లెక్సు పరిధిలోని పలు పాఠశాలల్లో మంగళవారం సమ్మిళిత విద్యా దినోత్సవం,బాలికా విద్యా దినోత్సవాలను ఘనంగా నిర్వహించారు.  ఈ కార్యక్రమాలను ప్రారంభించిన కాంప్లెక్సు ప్రధానోపాధ్యాయురాలు పి.హరిత మాట్లాడుతూ అశ్వారావుపేట జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు ప్రత్యేక బోధన జరుగుతుందని ఇందుకోసం ప్రభుత్వం ప్రత్యేక ఉపాధ్యాయుడిని నియమించిందని వీరి ద్వారా ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలను బడిలో చేర్పించాలని తెలిపారు. అదేవిధంగా బాలికా విద్యా దినోత్సవాన్ని పాఠశాలలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణా ప్రభుత్వం బాలికా విద్యాభివృద్ధి కొరకు ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించింది అని బాలికలు సాధికారికతను సాధించాలని ప్రతిరోజు పాఠశాలకు హాజరు కావాలని తెలిపారు.బాలికలు అందరికి వారు ఆరోగ్యపరంగా , సమాజ పరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో బాలికా సాధికారిత కమిటి కన్వీనర్  పర్వీన్,ప్రత్యేక విద్య ఉపాధ్యాయుడు రాంమోహన్,సి.ఆర్.పి ప్రభాకరాచార్యులు,పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -