Wednesday, June 18, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంపల్లాకు తమ్మినేని పరామర్శ

పల్లాకు తమ్మినేని పరామర్శ

- Advertisement -

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డిని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎండీ అబ్బాస్‌ మంగళవారం హైదరాబాద్‌లోని సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో పరామర్శించారు. ఇటీవల్లే కేసీఆర్‌ ఫాంహౌస్‌లో రాజేశ్వర్‌రెడ్డి గాయపడిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. రాజేశ్వర్‌రెడ్డి ఆరోగ్య పరిస్థితి గురించి తమ్మినేని అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకుని ప్రజా కార్యక్రమాల్లో పాల్గొనాలని ఆకాంక్షించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -