నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
చదువుకోవాలి చిత్రానికి గద్దర్ ప్రత్యేక అవార్డు వచ్చిన సందర్భంగా ఆ సినిమా దర్శకుడు, నిర్మాత, రచయిత, అతిథి ఎడిటర్ ఎం వెంకటేశ్వరరావును రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) కె రామకృష్ణారావు మంగళశారం హైదరాబాద్లోని సచివాల యంలో సన్మానించారు. అభినందనలు తెలిపారు. విద్యపై వచ్చిన ఉత్తమ చిత్ర చదువుకోవాలి అంటూ ప్రశంసించారు. అంతకుముందు వెంకటేశ్వరరావును సచివాలయ అధికారుల సంఘం అధ్యక్షుడు గంధం సురేష్కుమార్ సత్కరించారు. ఈ కార్యక్రమంలో సచివాలయ అధికారుల సంఘం నాయకులు కె శ్రీనివాస్, లాల్ బహదూర్ శాస్త్రి, రెవెన్యూ శాఖ సంక్షేమ సంఘం అధ్యక్షుడు కిషోర్కుమార్, సచివాలయ కోఆపరేటివ్ సొసైటీ డైరెక్టర్ కె స్వామి తదితరులు పాల్గొన్నారు. భవిష్యత్తులో మరిన్ని సందేశాత్మక చిత్రాలను తీయాలని కోరారు.
వెంకటేశ్వరరావుకు సీఎస్ సన్మానం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES