నవతెలంగాణ-డిచ్పల్లి: మండలంలోని మిట్టపల్లి గ్రామంలో ప్రజా పంపిణీ బియ్యంను లబ్దిదారుల నుండి కొనుగోలు చేసి అక్రమముగా నిల్వ చేసిన 11 క్వింటాళ్ల 20 కిలోల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకుని సీజ్ చేసినట్లు రెవెన్యూ ఇన్స్పెక్టర్ సంతోష్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం మిట్టపల్లి గ్రామానికి చెందిన చెన్న శ్రీనివాస్ వద్ద ప్రజా పంపిణీ బియ్యంను లబ్దిదారుల నుండి కొనుగోలు చేసి అక్రమంగా నిల్వ చేసినట్లు సమాచారం రావడంతో సివిల్ సప్లై సీనియర్ అసిస్టెంట్ మహేష్ కుమార్ అధ్వర్యంలో దాడి చేసి (28) బస్తాల్లో ఉన్న 11 క్వింటాళ్ల 20 కిలోలు స్వాధీనం చేసుకుని 6A కేసు నమోదు చేసి నిందితుని పై కేసు నమోదు చేయడానికి డిచ్ పల్లి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు.
పీడీఎస్ బియ్యం స్వాధీనం..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES