– ఎంపీడీవో జయరాం నాయక్
నవతెలంగాణ నవాబు పేట : పరిసరాల పరిశుభ్రత పాటించాలి అని ఎంపీడీవో జయరాం నాయక్ అన్నారు బుధవారం మండల పరిధిలోని ఇమ్మనగండ్ల గ్రామంలో పలు వీధులలో పెరిగిన పిచ్చి మొక్కలను డ్రైనేజీ లో పేరుకుపోయిన మురికి చెత్తను పిచ్చిమొక్కలు గ్రామపంచాయతీ కార్మికుల ద్వారా తొలగించి పరిశుభ్రత పాటించాలి అని వీధులలో తిరిగి అవగాహన కల్పించారు.సీజనల్ వ్యాధులు రాకుండా ఉండాలంటే ప్రజలు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న చెత్త లేకుండా గుంతలలో నీటి నిల్వ ఉండకుండా చూసుకోవాలి అని సూచించారు.దోమలు ఈగల వల్ల పలు రకాల వ్యాధులు వస్తాయి అని సూచించారు.ఈ కార్యక్రమంలో ఎంపీఓ భద్రు నాయక్ పంచాయతి కార్యదర్శి సుష్మా నాయకులు హమీద్ మహెక్ పంచాయతి కార్మికులు తదితరులు పాల్గొన్నారు.
పరిసరాల పరిశుభ్రత పాటించాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES