Thursday, June 19, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలి

అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలి

- Advertisement -

– ఇండ్ల కేటాయింపుల్లో అవినీతి అక్రమలను అరికట్టాలి
– కౌలు రైతులకు వెంటనే రైతు భరోసా వర్తింపజేయాలి
– సన్న వడ్లకు  బోనస్ వెంటనే చెల్లించాలి
– బిఆర్ఎస్ పార్టీ ములుగు నియోజకవర్గ ఇంచార్జి, మాజీ జడ్పీ చైర్పర్సన్ బడే నాగ జ్యోతి 
నవతెలంగాణ -తాడ్వాయి  : జిల్లాలలో అర్హులైన నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని, ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపులో అవినీతి అక్రమాలను అరికట్టాలని బిఆర్ఎస్ పార్టీ ములుగు నియోజకవర్గ ఇన్చార్జ్, మాజీ జెడ్పి చైర్ పర్సన్ బడే నాగజ్యోతి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని బీరెల్లి గ్రామంలో అర్హులైన నీరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు కేటాయించాలని మాజీ గ్రంథాలయం చైర్మన్ గోవింద నాయక్, మాజీ జెడ్పిటిసి రామసహాయం శ్రీనివాస్ రెడ్డి లతో, పార్టీ శ్రేణులతో కలిసి గ్రామంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. మొదట బిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గం ఇన్చార్జి, మాజీ జెడ్పి చైర్ పర్సన్ బడే నాగజ్యోతి పూల మాలలు వేసి మహిళలు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం విలేకరులతో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో 420 హామీలతో గద్దెనెక్కిందని, అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీలు, రైతు భరోసా కళ్యాణ్ లక్ష్మి తులం బంగారం మహిళలకు నెలకు 2500 కాలేజీ విద్యార్థులకు స్కూటీలు ఇవన్నీ మరిచి, రానున్న స్థానిక సంస్థ ఎన్నికల దృష్టిలో పెట్టుకొని అమాయక ప్రజలను మోసం చేయడానికి ఇంద్రమ్మ ఇల్లు జాబితాను విడుదల చేశారని అన్నారు. గిరిజన మంత్రి సీతక్క జిల్లాలో విడుదల చేసిన ఇంద్ర మహిళ జాబితాలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అవకతవకలకు పాల్పడిన, ఆరోపణలు వచ్చిన పరిశీలించకుండా, మార్బుల్ చేయకుండా అదే జాబితాను కొనసాగించడం దారుణమని నాగజ్యోతి ఖండించారు. ఇచ్చిన హామీల్లో ఏ ఒక్క హామీ నెరవేర్చలేదని కాంగ్రెస్ ప్రభుత్వం పై ఆమె మండిపడ్డారు. జిల్లాలలో అర్హులకు కాకుండా అనర్హులకు కట్టబెట్టారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు . అసలైన లబ్ధిదారులను జాబితాలో చేర్చకుండా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు డబ్బులు చెల్లించిన వారికి ఇందిరమ్మ ఇండ్లు  మంజూరు చేశారని ఆమె తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 18 నెలల అయినా కూడా ఏ ఒక్క పథకం కూడా సక్రమంగా అమలు చేయలేదని, కౌలు రైతులకు రైతు భరోసా వర్తింపజేయాలని ఆమె ప్రభుత్వాన్ని కోరారు. సన్న ధాన్యానికి ఇచ్చే 500 బోనస్ వెంటనే చెల్లించాలని, రైతులకు సకాలంలో  నాణ్యమైన విత్తనాలు ఎరువులు అందించాలని ఆమె ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

 మంత్రి సీతక్క ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట అధికారంలో ఉన్నప్పుడు మరో మాట మాట్లాడుతూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నట్లు ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మాట ఇచ్చి తప్పడం కాంగ్రెస్ కి వెన్నతో పెట్టిన విద్యనే అని అన్నారు. అర్హులైన నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వకపోతే  ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని ఆమె ప్రభుత్వాన్ని హెచ్చరించారు. గిరిజన మంత్రి గా కొనసాగుతున్న సీతక్క జిల్లాలోని ఏటూరు నాగారం మండలం రోహీర్ బీటు పరిధిలో నిరుపేదల గుడిసెలను అటవీ శాఖ అధికారులు తొలగించే ప్రయత్నం చేయడం దారుణమైన ఘటన అని విమర్శించారు. మంత్రి సీతక్క నియోజకవర్గంలోని గ్రామాలలో చాలా సమస్యలు ఉన్నాయని, వాటితో పాటు గిరిజన దాడులను వెంటనే స్పందించి బాధితులకు ఇందిరమ్మ ఇల్లు ఇప్పించి ఆదుకోవాలని, లేదంటే గిరిజను పక్షాన బి ఆర్ ఎస్ పార్టీ అండగా నిలబడి ఉద్యమాలు చేపడతామని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆమె హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ పోరిక గోవింద్ నాయక్, మాజీ జెడ్పిటిసి రామ సహాయం శ్రీనివాసరెడ్డి, మండల అధ్యక్షులు దుండగుల మల్లయ్య, మండల ప్రధాన కార్యదర్శి పోగు నాగేష్, మాజీ మండల అధ్యక్షుడు దిడ్డి మోహన్ రావు, మహిళా మండల అధ్యక్షురాలు సామ నాగక్క, బీరెల్లి మాజీ సర్పంచ్ జాజా చంద్రం, గ్రామ కమిటీ అధ్యక్షులు దాయ రోషన్న, మాజీ మండల ఉపాధ్యక్షులు పెనక విశ్వనాథం, జిల్లా మహిళ నాయకురాలు ఇర్ప విజయ, సమన్వయ కమిటీ సభ్యులు జీడి బాబురావు, సీనియర్ నాయకులు మోరే నరసింగరావు, భాసాని సురేష్, బెజ్జూరి శ్రీకాంత్, బాగే రాములు, లక్ష్మణ్, బీరెల్లి సోషల్ మీడియాగడదాసు శ్రీను, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -