నవతెలంగాణ హైదరాబాద్: మహాత్మాగాంధీ బస్టాండు (ఎంజీబీఎస్) లో ఓ మహిళ మృతి చెందింది. ప్రయాణికులు గమనించి ఆర్టీసీ అధికారులకు సమాచారమిచ్చారు. ఆర్టీసీ అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. అఫ్జల్గంజ్ ఎస్ఐ జగదీశ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఎంజీబీఎస్లోని ప్లాట్ఫారం నంబర్ 33 వద్దనున్న వెయిటింగ్ సీట్లో దాదాపు 40 ఏండ్ల వయసున్న గుర్తు తెలియని ఓ మహిళ చనిపోయి ఉన్నది. ప్రయాణికులు గమనించి ఆర్టీసీ అధికారులకు సమాచారమిచ్చారు. ఆర్టీసీ అధికారుల ఫిర్యాదు మేరకు ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు శవ పంచనామా నిర్వహించారు. ఆమె ఆచూకీ కోసం పోలీసులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. బస్టాండులో ఉన్న ఎవరు కూడా ఆమెను గుర్తించలేదు. దీంతో మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రి మార్చురీలో భద్రపరిచారు. మృతురాలు పసుపు, ఆకుపచ్చ రంగు చీర, పసుపు రంగు జాకెట్ ధరించి ఉన్నదని ఎస్ఐ తెలిపారు. మృతురాలి వివరాలు తెలిస్తే అఫ్జల్గంజ్ పీఎస్ లేదా 8712515489/8712660534 నంబర్లలో సంప్రదించాలని ఎస్ఐ కోరారు.