నవతెలంగాణ కరీంనగర్
టిఎస్ స్థానంలో టిజీ అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో దీంతో జిల్లాలోని అన్ని శాఖల ఉన్నత అధికారులు తక్షణమే రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులను అమలు చేయాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశించారు.
ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర అబ్రియేషన్స్ సూచించే ‘టీఎస్’ స్థానంలో టీజీ ని వినియోగించేందుకు కేంద్రం అనుమతిస్తూ గెజిట్ జారీ చేసిన దృష్ట్యా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి శుక్రవారం ఉత్తర్వులు వెలుపడ్డాయని పేర్కొన్నారు.
జిల్లాలో ఇకపై అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలు, ఏజెన్సీలు, పబ్లిక్ సెక్టార్ యూనిట్లు, ఏజెన్సీలు, స్వయంప్రతిపత్తి గల సంస్థలు, కార్పొరేషన్లు,వెబ్సైట్లు, ఆన్లైన్ ప్లాట్ఫారమ్లు.. ఏదైనా ఇతర అధికారిక కమ్యూనికేషన్లు సైతం తెలంగాణ కోడ్ ను టీఎస్ బదులుగా టీజీని వాడాలని కలెక్టర్ కోరారు.
లెటర్ హెడ్లు, రిపోర్టులు, నోటిఫికేషన్లు, అధికారిక వెబ్ సైట్లు, ఆన్లైన్ ఫ్లాట్ ఫార్మ్స్, పాలసీ పేపర్లు, జీవోలు, ఇతర అధికారిక
కమ్యూనికేషన్లన్నింటిపై టీఎస్ స్థానంలో టీజీగా మార్చాలని పేర్కొన్నారు. శాఖలు ద్వారా భవిష్యత్తులో నిర్వహించే ఉత్తర, ప్రత్యుత్తరాలలో టీఎస్ కు బదులుగా టీజీని ముద్రించాలని సూచించారు.
ఈ మేరకు తీసుకున్న చర్యలపై ఈ నెల 25వ తేదీలోపు అన్ని శాఖల జిల్లా అధికారులు తగిన నివేదికలు పంపాలని, ఆ నివేదికలు క్రోడీకరించి ప్రభుత్వానికి పంపనున్నట్లు కలెక్టర్ తెలిపారు.