నవతెలంగాణ-హైదరాబాద్ : గోల్డ్ స్మగ్లింగ్ ప్రయత్నాన్ని సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) జవాన్లు అడ్డుకున్నారు. ఒక ఇంటిని చుట్టుముట్టారు. గ్రామస్తుల సమక్షంలో తనిఖీ చేశారు. కోట్ల విలువైన బంగారం బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నారు. పశ్చిమ బెంగాల్లోని ఉత్తర 24 పరగణాల జిల్లాలో ఈ సంఘటన జరిగింది. భారత్-బంగ్లాదేశ్ సరిహద్దు గ్రామంలోని ఒక ఇంట్లో స్మగ్లింగ్ కోసం భారీగా బంగారాన్ని దాచినట్లు బీఎస్ఎఫ్కు ఇంటెలిజెన్స్ సమాచారం అందింది. కాగా, బీఎస్ఎఫ్ అధికారులు, జవాన్లు ఆదివారం ఆ ఇంటిని చుట్టుముట్టారు. గ్రామస్తుల సమక్షంలో ఆ ఇంట్లో సోదాలు చేశారు. లోపల దాచిన 86 బంగారు బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నారు. 16.07 కేజీల బరువున్న గోల్డ్ బిస్కెట్ల విలువ రూ.12 కోట్లకుపైగా ఉంటుందని బీఎస్ఎఫ్ అధికారులు తెలిపారు. ఒక వ్యక్తిని అరెస్ట్ చేసి దీని గురించి ప్రశ్నిస్తున్నారు.