– కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సుంకేట రవి
నవతెలంగాణ – కమ్మర్ పల్లి : ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల కోసం ప్రభుత్వం ఉచితంగా ఇసుకను అందిస్తుందని, ఈ అవకాశాన్ని ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సుంకేట రవి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ మండల కార్యాలయంలో ఏర్పాటు చేసిన స్థానిక విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇందిరమ్మ నిర్మాణం కోసం అవసరమైన ఇసుకను ప్రతి బుధవారం ప్రభుత్వం కేటాయించిన రీచ్ ల నుండి ఉచితంగా అందించడం జరుగుతుందన్నారు. మండలంలోని ఉప్లూర్, కమ్మర్ పల్లి, నాగపూర్ గ్రామాలకు ఏర్గట్ల మండలంలోని బట్ట పూర్ ఇసుక పాయింట్ నుండి అందించడం జరుగుతుందన్నారు. చౌట్ పల్లి, బషీరాబాద్, కోన సముందర్, కోనాపూర్, మండలంలోని ఇతర గ్రామాలకు భీంగల్ ఇసుక పెయింట్ నుంచి సరఫరా జరుగుతుందన్నారు. కమ్మర్ పల్లి టౌన్ కు మోర్తాడ్ మండలం పాలెం, ఏర్గట్ల మండలం తోర్తి ఇసుక పాయింట్ నుండి అందించడం జరుగుతుందన్నారు. ఇందుకు ఇందిరమ్మ లబ్ధిదారులు స్థానిక గ్రామపంచాయతీలో పంచాయతీ కార్యదర్శి ద్వారా ఇండెంట్ తీసుకొని తహసిల్దార్ కార్యాలయంలో అందజేస్తే వేబిల్ అనుమతులు ఇస్తారన్నారు. అట్టి వేబిల్ తీసుకొని సంబంధిత ఇసుక పోయిండ్ల వద్దకు వెళ్లి లబ్ధిదారులు సొంత ఇసుక ఉచితంగా తెచ్చుకోవచ్చు అన్నారు.ఈ అవకాశాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు ఉచితంగా ఇసుకను అందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లబ్ధిదారుల తరఫున సుంకేట రవి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ జైడి శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నూకల బుచ్చి మల్లయ్య, నాయకులు సింగిరెడ్డి శేఖర్, పూజారి శేఖర్, సల్లూరి గణేష్ గౌడ్, వేములవాడ జగదీష్, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు
ఉచిత ఇసుకను సద్వినియోగం చేసుకోవాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES