నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ : యాదాద్రి భువనగిరి జిల్లాకు తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, 5 మంది సభ్యులు తెలంగాణ రాష్ట్ర కమీషన్ ఎస్సి,ఎస్టి వారి సమీక్ష సమావేశమునకు సంబంధిత శాఖల జిల్లా అధికారులు పూర్తి సమాచారంతో రావాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు అన్నారు. శుక్రవారం మినీ మీటింగ్ హాల్ లో ఈ నెల 21 న కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరగబోయే సమీక్ష సమావేశమునకు వివిధ శాఖల జిల్లా అధికారులతో రెవెన్యూ అదనపు కలెక్టర్ వీరారెడ్డి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు తో కలసి జిల్లా కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ బక్కి వెంకటయ్య చైర్మన్ , 5 మంది సభ్యులు తెలంగాణ రాష్ట్ర కమీషన్ ఎస్సి , ఎస్టీ వారి సమీక్ష సమావేశమునకు సంబంధిత శాఖ అధికారులు సరైన జాబితా, పూర్తి సమాచారంతో రావాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.
వివిధ శాఖల ద్వారా ఎస్సీ, ఎస్టీ ద్వారా అమలు జరిగే పథకాలపై 2024-2025, 2025-26 ఆర్థిక సంవత్సరమునకు సంబందించిన పూర్తి సమాచారం తయారు చేసుకొని సమావేశంకు సకాలంలో హాజరు కావాలని సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో భువనగిరి ఆర్డిఓ కృష్ణారెడ్డి, చౌటుప్పల్ ఆర్డీవో శేఖర్ రెడ్డి, ఇంచార్జ్ ఎస్సీ సంక్షేమ అధికారి శ్యాంసుందర్ , జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారి నాగిరెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి సునంద, సంబంధిత శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.