Saturday, June 21, 2025
E-PAPER
Homeతాజా వార్తలుఅఫీషియల్ ప్రోగ్రాంలో ప్రోటోకాల్ రగడ 

అఫీషియల్ ప్రోగ్రాంలో ప్రోటోకాల్ రగడ 

- Advertisement -

బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్
రసాభాసగా మంత్రి ప్రోగ్రాం 
నవతెలంగాణ – దుబ్బాక 
: ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్ కాపీల పంపిణీ కార్యక్రమం రసాభాసగా మారింది. శుక్రవారం దుబ్బాక నియోజకవర్గానికి సంబంధించిన 2600 ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్ కాపీల పంపిణీ కార్యక్రమాన్ని దుబ్బాక లోని రజనీకాంత్ రెడ్డి ఫంక్షన్ హాల్ లో అధికారులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర కార్మిక, ఉపాధి, గనుల శాఖ మంత్రి, ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్చార్జి మంత్రి వివేక్ వెంకటస్వామి హాజరైనారు. ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డితో కలిసి మంత్రి వెంకటస్వామి జ్యోతి ప్రజ్వలన చేసి ఇందిరమ్మ ఇంటి నమూనాను ఆవిష్కరించారు. అనంతరం లబ్ధిదారులకు ప్రోసిడింగ్ కాపీలను మంత్రి అందజేసి మాట్లాడారు. తమది ముమ్మాటికి ప్రజా ప్రభుత్వమని, గత 12 ఏళ్లలో ప్రజలు నిర్బంధం, వివక్షకు గురైన పరిస్థితులు ఉండేవని.. నేడు కాంగ్రెస్ సర్కార్ అధికారం లోకి వచ్చిన నాటి నుంచి ప్రజలకు పూర్తి స్వేచ్ఛ లభించిందన్నారు.

కష్టాల్లో ఉన్నా కూడా సంక్షేమ పథకాలను ఆపొద్దని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ సర్కార్ 6 గ్యారంటీలను అమలు చేస్తుందన్నారు. విడతలవారీగా అర్హులైన ప్రతి ఒక్క పేదోడికి ఇందిరమ్మ ఇళ్ళను మంజూరు చేస్తామని స్పష్టం చేశారు.

 బీఆర్ఎస్ శ్రేణుల నిరసన..

ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఫోటోను ఫ్లెక్సీలో చిన్నగా వేశారంటూ బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ డౌన్ డౌన్, సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. దీనికి ప్రతిగా కాంగ్రెస్ శ్రేణులు ఎమ్మెల్యే డౌన్ డౌన్, గో బ్యాక్ ఎమ్మెల్యే అంటూ నినాదాలు చేశారు. పరస్పర నినాదాలతో ఆ ప్రాంగణమంతా మార్మోగింది. పోలీసులు ఇరువర్గాలను అక్కడినుంచి బయటకు తీసుకెళ్లారు. 

ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. అధికారులు ప్రోటోకాల్ పాటించడం లేదంటూ, ప్రోటోకాల్ లేని వ్యక్తులను అఫీషియల్ ప్రోగ్రాం వేదిక పైకి ఎలా ఆహ్వానిస్తారంటూ ఎమ్మెల్యే మండిపడ్డారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ పరస్పర నినాదాల మధ్యే లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్ కాపీలను ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ హైమావతి, అదనపు కలెక్టర్ గరిమా అగ్రవాల్ తో కలిసి మంత్రి వివేక్ వెంకటస్వామి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో శుక్రవారం దుబ్బాక పట్టణ కేంద్రంలోని కోమటిరెడ్డి రజనీకాంత్ రెడ్డి ఫంక్షన్ హాల్లో ఏర్పాటుచేసిన దుబ్బాక నియోజకవర్గ పరిధిలోని “ఇందిరమ్మ ఇండ్ల మంజూరి పత్రాలు పంపిణీ” కార్యక్రమం…ఈ కార్యక్రమంలో ఆర్డీవో సదానందం, హౌసింగ్ పీడీ దామోదర్ రావు, డీఈ శ్రీనివాస్, పలువురు జిల్లా అధికారులు, తహసీల్దార్ ఈ.సంజీవ్ కుమార్,మున్సిపల్ కమిషనర్ కే రమేష్ కుమార్, ఎంపీడీవో వీ.భాస్కర శర్మ, ఎంఈఓ జే.ప్రభుదాస్, మున్సిపల్, రెవెన్యూ, మండల పరిషత్ సిబ్బంది, కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు, పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -