- Advertisement -
- – స్టాఫ్ నర్స్ ఒక్కరే హాజరు..
– డిప్యూటీ డిఎం అండ్ హెచ్ ఓ ఆగ్రహం - నవతెలంగాణ -తాడ్వాయి
- ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని లింగాల గ్రామపంచాయతీ అటవీ గ్రామాల ఆదివాసుల వైద్య సేవల నిమిత్తం ఏర్పాటు చేసిన కొడిశల “ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో” శుక్రవారం వైద్యులు, హెచ్ ఇ ఓ, ఫార్మసిస్ట్, హెల్త్ సూపర్వైజర్, హెచ్ వి, వీరెవరు విధులకు హాజరు కాకుండా డుమ్మా కొట్టారు. ఒక్క స్టాఫ్ నర్స్ మాత్రమే విధులకు హాజరయ్యారు. ఇలా ఉండగా డిప్యూటీ డిఎంహెచ్వో డాక్టర్ క్రాంతి కుమార్ ఆకస్మికంగా శుక్రవారం కొడిశల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి పరిశీలించారు. హాజరు రిజిస్టర్ ను పరిశీలించారు. ఆ సమయంలో ఆస్పత్రిలో ఉండాల్సిన వైద్యులు, వైద్య సిబ్బంది విధుల్లో లేకపోగా డాక్టర్ క్రాంతి కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైద్యులకు సిబ్బందికి ఫోన్ చేసి గైరాజా కావడంపై ప్రశ్నించారు. ఇలాంటి సంఘటన పునృతం అయితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
- కాగా లింగాల గ్రామపంచాయతీ పరిధిలో గల ఆదివాసి గూడెం లలో వైద్యం అందే విధంగా కొడిశలలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేశారని, కానీ అందులో ఎప్పటికీ ఎవరు ఉండరని ఆదివాసీలు ఆవేదన చెందారు. ఇప్పటికైనా కలెక్టర్, జిల్లా వైద్యాధికారి ఇట్టి విషయాన్ని పరిశీలించి, మా(కొడశల) ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యులకు డిప్టూటేషన్ వేయకుండా అందరు హాజరయ్యే విధంగా చూడాలని ఆదివాసి ప్రజలు కోరుకుంటున్నారు.
- Advertisement -