- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
మాదక ద్రవ్యాల నిర్మూలనలో భాగంగా జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ ఆదేశాల మేరకు కొయ్యూరు ఎస్ఐ మహేందర్ కుమార్ ఆధ్వర్యంలో పోలీస్ స్టేషన్లో గురువారం విద్యార్థులతో ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని నిర్వహించి, మాదకద్రవ్యాల నిర్ములనపై అవగాహన నిర్వహించారు. డ్రగ్స్ వాడడం వల్ల కలిగే దుష్ప్రభావాలను వివరించారు. పోలీసులకు అందరూ సహకరించి నిర్మూలనలో అందరూ భాగస్వాములు కావాలని కోరారు.
- Advertisement -



