Sunday, June 22, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్విద్యాహక్కు చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలి

విద్యాహక్కు చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలి

- Advertisement -

నవతెలంగాణ – కంఠేశ్వర్ : విద్య హక్కు చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి కొండగంగాధర్ అన్నారు. ఈ మేరకు శనివారం కెవిపిఎస్ కార్యాలయంలో జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఎస్సీ ఎస్టీ లకు 25 శాతం ఉచితంగా రిజర్వేషన్ ఇవ్వాలని చట్టం చెబుతుంది కానీ ప్రైవేటు విద్యాసంస్థలు ఏమి కూడా పాటించకుండా ఉల్లంఘిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కూడా వీటి పైన ఉదాసీనేత కలిగి ఉంటుంది హక్కులకు సంబంధించిన పిల్లలు దళితులు గిరిజనులుకు సంబంధించిన పిల్లలు సరియైన విద్య అందరికీ అందడం లేదు. ఈరోజు విద్యారంగం కోట్లు పెట్టి కొనుక్కోవడం వ్యాపారంగా మారింది ఉచితంగా అందించే పరిస్థితి లేదు ఎల్కేజీ పిల్లలకు డొనేషన్ల పేరు మీద ఫీజుల పేరు మీద లక్షల డబ్బులు వసూలు చేస్తున్నారు. కొఠారి కమిషన్ చెప్పిన ఉచిత విద్య ఏనాడో చెప్పింది.

విద్యారంగాలు ఇటువంటి లోపాలు కొనసాగుతున్నాయి కేంద్ర ప్రభుత్వం 60% రాష్ట్ర ప్రభుత్వం 30% రాయితీలు రావడం లేదు. ప్రైవేటు ప్రభుత్వాలు చీకటి ఒప్పందాలు జరుగుతున్నాయి విద్య హక్కు చట్టాన్ని ప్రభుత్వం పటిష్టంగా అమలు చేయాలి. బెస్ట్ అవైలబుల్ స్కీం కింద ప్రభుత్వం స్కీము కార్పొరేటు పాఠశాలలకు దీటుగా నిర్వర్తించడం జరుగుతున్నది. బడ్జెట్ మాత్రం ఇంతవరకు యువ నందున విద్యార్థుల తల్లిదండ్రుల నుండి ఫీజులు వసూలు చేస్తున్నటువంటి ప్రవేట్ పాఠశాలలు పేరెంట్స్ కు ఇబ్బంది కలిగిస్తున్నాయి. బడ్జెట్ రాణి కారణంగా పేద విద్యార్థులకు ఆ విద్య దూరం కానున్నది. విద్యకు చట్టం అమలు కచ్చితంగా అమలు చేయాలని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం డిమాండ్ చేస్తుంది విద్యాహక్కు చట్టం అమలు చేయని ప్రైవేటు విద్యాసంస్థలను సీజ్ చేసి చర్యలు తీసుకోవాలని కెవిపిఎస్ గా డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నరసయ్య పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -