- Advertisement -
నవతెలంగాణ – రెంజల్ : రెంజల్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో శనివారం మాదకద్రవ్యాల నిర్మూలలపై అవగాహన ర్యాలీ నిర్వహించి విద్యార్థులకు అవగాహన కల్పించినట్లు రెంజల్ ఎస్ ఐ కే .చంద్రమోహన్ తెలిపారు. సిపి ఆదేశాల మేరకు పలు గ్రామాలలో మాదకద్రగాల నిర్మూలనపై అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్రు. శనివారం మధ్యాహ్నం జిల్లా పరిషత్ పాఠశాల నీలా గ్రామంలో విద్యార్థులచే ర్యాలీ నిర్వహించి గాంధీ విగ్రహం వద్ద మానవహారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రేంజర్ ఎస్సై కే .చంద్రమోహన్, పోలీస్ సిబ్బంది శ్రీనివాస్, ప్రవీణ్, ఉపాధ్యాయులు ఆనంద్, సాయిబాబా తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -