నవతెలంగాణ – హైదరాబాద్: సెక్స్ స్కాండల్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు, జేడీఎస్ సిట్టింగ్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ తన సొంత నియోజకవర్గం హసన్లో ఓటమి పాలయ్యారు. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి శ్రేయస్ ఎం పాటిల్ 44,000 ఓట్ల తేడాతో ప్రజ్వల్పై గెలుపొందారు. కౌంటింగ్ ప్రారంభమైన సమయంలో ప్రజ్వల్ ఆధిక్యంలో కొనసాగిన విషయం తెలిసిందే. ఆ తర్వాత వెనుకంజలోకి వెళ్లిపోయారు. ఇప్పుడు 44 వేల ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో 1.4 లక్షల మెజారిటీతో హసన్ నుంచి ప్రజ్వల్ గెలుపొందిన విషయం తెలిసిందే. ఇక ఈసారి కర్ణాటకలో బీజేపీతో పొత్తుతో జేడీ(ఎస్) కర్ణాటకలో పోటీ చేసింది.