రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎం.యాదగిరి..
నవతెలంగాణ – డిచ్ పల్లి: ఆరోగ్యంగా ఆనందమైన జీవితాన్ని గడపడానికి యోగ ఎంతో దోహదం చేస్తుందని శారీరక దృఢత్వం, మానసిక స్థిరత్వం, ఆధ్యాత్మిక ఆనందం కలుగుతుందని రిజిస్ట్రార్ ప్రొఫెసర్ డాక్టర్ ఎం యాదగిరి పేర్కొన్నారు. శనివారం తెలంగాణ యూనివర్సిటీ లో ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో జరిగిన 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రిజిస్ట్రార్ ప్రసంగిస్తూ ప్రపంచానికి భారతదేశం అందించిన గొప్ప వరం యోగా అన్నారు.విద్యార్థులు ఒత్తిడి ఆందోళనతో సతమతం కాకుండా వారి దినచర్యలో యోగాను భాగం చేసుకోవాలన్నారు.శాస్త్రీయంగా యోగాతో మానస్సు, శారీరం సమతుల్యత సాధిస్తుందన్నారు. ప్రధానంగా విద్యార్థి దశలో కలిగే ఒత్తిడిని యోగాతో నివారించుకొని ఉన్నతంగా ఎదగాలన్నారు.
యూనివర్సిటీ విద్యార్థులందరూ యోగాను ఒకరోజు కార్యక్రమంలో కాకుండా జీవితంలో భాగం చేసుకోవాలన్నారు.ఆధునిక యుగంలో యోగా అంటే శారీరక వ్యాయామం మాత్రమే కాదని అదొక జీవన ప్రమాణమని, శాంతి, క్రమశిక్షణతో కూడిన జీవనానికి యోగా ఎంతో అవసరం అని పేర్కొన్నారు.భారతదేశంలో అనాదిగా పుట్టిన యోగ నేడు సరిహద్దులు, సంస్కృతులు, సాంప్రదాయాలను దాటి ఇప్పుడు విశ్వవ్యాప్తమైందని ఈ క్రమంలో నేడు అంతర్జాతీయంగా 200 దేశాలకు పైగా ఈరోజు యోగా కార్యక్రమాలు నిర్వహించడం ప్రతి భారతీయుడు గర్వించదగ్గ విషయమన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ సమన్వయకర్త ప్రొఫెసర్ కే రవీందర్ రెడ్డి, డైరెక్టర్ పి ఆర్ ఓ డాక్టర్. ఏ. పున్నయ్య, డాక్టర్ మహేందర్ ఐలేని, ఫిజికల్ డైరెక్టర్ బిఆర్ నేత, సురేష్, రవీందర్ నాయక్, తదితర బోధన బోధ నేతర సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు. అనంతరం శ్రీశ్రీ సిద్దరామయ్య గురువు విద్యార్థులకు నిర్వహించిన యోగాసనాల ప్రదర్శన ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరిని వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ టి యాదగిరిరావు అభినందించారు.