నవతెలంగాణ – అమరావతి: ఎన్నికల ఫలితాల్లో స్పష్టమైన మెజారిటీ రావడంతో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్తో భేటీ అయ్యారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని జనసేన కార్యాలయానికి వచ్చిన చంద్రబాబుకు పవన్ సాదర స్వాగతం పలికి శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా ఇరువురు నేతలు పరస్పరం అభినందనలు తెలియజేసుకున్నారు. అనంతరం ప్రత్యేకంగా భేటీ అయిన నేతలు.. ప్రభుత్వ ఏర్పాటు, సీఎం ప్రమాణస్వీకారానికి సంబంధించిన ఏర్పాట్లపై చర్చించినట్టు సమాచారం. ఎన్డీయే సమావేశానికి హాజరయ్యే అంశంపైనా ఇరువురు నేతలు సమాలోచనలు జరిపినట్టు తెలుస్తోంది.