చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై నేడు సుప్రీంకోర్టులో విచారణ

నవతెలంగాణ – ఢిల్లీ
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ ధర్మాసనం ఈ పిటిషన్ ను విచారించనుంది. చంద్రబాబు తరపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా వాదలనలు వినిపించనున్నారు. చంద్రబాబు క్వాష్ పిటిషన్ ను ఏపీ హైకోర్టు కొట్టివేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హైకోర్టు తీర్పును చంద్రబాబు తరపు లాయర్లు సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. శనివారం నాడు సుప్రీంకోర్టు రిజిస్ట్రీలో స్పెషల్ లీవ్ పిటిషన్ ను న్యాయవాది గుంటూరు ప్రమోద్ కుమార్ దాఖలు చేశారు. 17ఏ చంద్రబాబుకు వర్తిస్తుందని చంద్రబాబు తరపు న్యాయవాదులు సుప్రీంకోర్టులో వాదనలు వినిపించనున్నారు.

Spread the love