నవతెలంగాణ – జుక్కల్ : మండలంలోని పలు ప్రభుత్వ పాఠశాలలో అంతర్జాతీయ యోగా దినోత్సవం వేడుకలను ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండలంలోని బిజ్జల్ వాడి ఎంపీపీ ఎస్ పాఠశాల. హెచ్ఎం ఈ . రవికుమార్, పెద్ద ఏడ్గి జెడ్ పి హెచ్ ఎస్ పాఠశాల హెచ్ఎం తిరుపతయ్య , బస్వాపూర్ ఎంపీ యుపిఎస్ పాఠశాల హెచ్ఎం జయచంద్, , జుక్కల్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ పాఠశాల హెచ్ఎం హనుమంత్ రావ్ రెడ్డి, హంగర్గ లోని జడ్.పి.హెచ్.ఎస్ పాఠశాల హెచ్ఎం కత్తలయ్య , పడంపల్లి ఎంపియుపిఎస్ పాఠశాల హెచ్ఎం లాలయ్య మండలంలోని అన్ని ఎంపీపీ ఎస్ ఎంపీయూపీఎస్ , జెడ్పిహెచ్ఎస్ , ఆధ్వర్యంలో పాఠశాలల విద్యార్థిని విద్యార్థులకు యోగాసనాలు వేయించారు. ఈ సందర్భంగా ఆయా పాఠశాలల హెచ్ఎంలు మాట్లాడుతూ యోగా అనేది నిత్యజీవితంలో ఎంతో ఉపయోగకరమైన ఆరోగ్యంగా ఉండడానికి యోగాసనాలు ఎంతో ఉపయోగంగా ఉంటాయని ప్రతి విద్యార్థిని విద్యార్థులు ఉదయం వేళలో యోగాసనాలు వేసి తమ ఆరోగ్యాన్ని తానే కాపాడుకోవాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాలలోని పాఠశాలల విద్యార్థిని , విద్యార్థులు , పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఆయా పాఠశాలల ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో యోగా దినోత్సవ వేడుకలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES