Sunday, June 22, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఆరోగ్యమే మహాభాగ్యం

ఆరోగ్యమే మహాభాగ్యం

- Advertisement -

– పాఠశాలలో ఘనంగా యోగా డే
నవతెలంగాణ – కమ్మర్ పల్లి  : ఆరోగ్యమే మహాభాగ్యం.. ఆరోగ్యంగా ఉండాలంటే శరీరానికి ఆహారంతో పాటు, వ్యాయామం అవసరమని పలువురు పేర్కొన్నారు. శనివారం మండలంలోని ఆయా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో  యోగ దినోత్సవాన్ని పురస్కరించుకొని విద్యార్థులతో యోగా కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు.  పాఠశాల విద్యాశాఖ ఆదేశాల మేరకు అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని కమ్మర్ పల్లి, ఉప్లూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో యోగా దినోత్సవాన్ని నిర్వహించారు. విద్యార్థులచే సూర్య నమస్కారాలు చేయించి, ఆసనాలు వేయించారు. యోగ డే సందర్భంగా మిసిమి ఉన్నత పాఠశాలలో రిటైర్డ్ ఎంపీడీఓ భూమేశ్వర్ విద్యార్థులకు యోగా అసనాలు నేర్పించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు ఆచరించారు.యోగా దినోత్సవం సెలబ్రేషన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా యోగా సాధకులు ప్రభాకర్ మాట్లాడుతూ అనాదిగా భారతీయులు ఆరోగ్యంగా జీవించే జీవన విధానంలో యోగాను ఒక  భాగం చేసుకుని, అభ్యసిస్తూ ఆరోగ్యంగా జీవిస్తున్నారన్నారు. ప్రపంచ దేశాల ప్రజలు కూడా ఈ యోగ ద్వారా తమ ఆరోగ్యం రక్షించుకుంటున్నారని తెలిపారు. అనేక దేశాల్లో ప్రజలు ఆరోగ్యంగా జీవించడానికి యోగకు ప్రత్యేక స్థానాన్ని ఇచ్చారన్నారు.మన శరీరానికి కూడా వ్యాయామం అవసరమని తెలిపారు. అందరూ కూడా ప్రతిరోజు యోగను అభ్యసించి ఆరోగ్యంగా ఉండాలన్నారు. పలు పాఠశాలల్లో విద్యార్థులు యోగ అక్షరాల ఆకృతిలో కూర్చుని, ఆసనాలతో అలరించారు  కార్యక్రమంలో ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు సాయన్న పసుపుల సాయన్న, రాజన్న, వ్యాయామ ఉపాధ్యాయులు నాగభూషణం, గ్రామ యువకులు, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -