Tuesday, June 24, 2025
E-PAPER
Homeజాతీయంఇరాన్‌ నుంచి ఢిల్లీ చేరుకున్న ఏపీ విద్యార్థులు

ఇరాన్‌ నుంచి ఢిల్లీ చేరుకున్న ఏపీ విద్యార్థులు

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : ‘ఆపరేషన్‌ సింధు’లో భాగంగా ఇరాన్‌ నుంచి 10మంది ఏపీ విద్యార్థులు ఢిల్లీ చేరుకున్నారు. ఇరాన్‌, ఇజ్రాయెల్‌ ఉద్రిక్తతల దృష్ట్యా విదేశాంగశాఖ భారత్‌కు తీసుకొస్తోంది. ఇరాన్‌, ఇజ్రాయిల్‌ నుంచి వచ్చే బాధితుల కోసం ఢిల్లీలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. రెండు ప్రభుత్వాలు ఢిల్లీలోని ఏపీ, తెలంగాణ భవన్‌లలో ఏర్పాట్లు చేశాయి. ఢిల్లీ నుంచి స్వస్థలానికి పంపేందుకు రెసిడెంట్‌ కమిషనర్లు 2 టీమ్‌లను నియమించారు. ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేసిన విదేశాంగ శాఖ ఇప్పటి వరకు దాదాపు 1750 మంది భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -