Wednesday, June 25, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్వానలు కురవాలని గ్రామదేవతలకు నైవేద్యాలు

వానలు కురవాలని గ్రామదేవతలకు నైవేద్యాలు

- Advertisement -

నవతెలంగాణ – మద్నూర్ : వానలు బాగా కురవాలని, ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని కోరుకుంటూ మద్నూర్ లో ప్రజలు మంగళవారం నల్ల పోచమ్మ ఎర్ర పోచమ్మ గ్రామ దేవతలకు బోనాలను సమర్పిస్తూ మొక్కుకున్నారు. గ్రామంలో కులమతాలకతీతంగా ప్రతి కులబేడల వారు నైవేద్యాలు, మేలకను బలిచ్చారు. గ్రామ ప్రజలందరికీ సుఖ సంతోషాలతో ఉంచాలని కోరుకున్నారు. చిన్నా పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ గ్రామ దేవతలను దర్శించుకున్నారు. గ్రామ దేవతలకు పూజలు చేస్తే వర్షాలు బాగా కురుస్తాయని ప్రజల ప్రగాఢ నమ్మకం. మమ్ములను కనుకరించి, వానలు కురిపించాలని, పాడి పంటలతో వ్యవసాయం కళకలలాడాలని ఈ సందర్బంగా ప్రజలు మొక్కులు చెల్లించుకుని, వేడుకున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -