నవతెలంగాణ – ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ను సీబీఐ రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపర్చింది. ఆయనను తమ కస్టడీకి ఇవ్వాలని కోరుతోంది. ఈ కేసును ప్రత్యేక న్యాయమూర్తి అమితాబ్ రావత్ విచారిస్తున్నారు. ఇదే కోర్టులో వెకేషన్ జడ్జి నియాయ్ బిందు ఇటీవల కేజ్రీవాల్కు బెయిల్ మంజూరు చేయగా దానిపై హైకోర్టు స్టే విధించింది. ఇదిలా ఉంటే తిహార్ జైలులో కేజ్రీవాల్ను సీబీఐ నిన్న అరెస్ట్ చేసింది.