– భారత ప్రభుత్వం స్పష్టమైన వైఖరి వెల్లడించాలి
– రాష్ట్ర వ్యాప్తంగా వామపక్షాల నిరసన
నవతెలంగాణ- విలేకరులు
ఇరాన్పై అమెరికా దాడిని ఖండించాలని.. దాడిపై భారత ప్రభుత్వం స్పష్టమైన వైఖరి వెల్లడించాలని వామపక్ష పార్టీలు డిమాండ్ చేశాయి. ఈ సందర్భంగా మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ట్రంప్ దిష్టిబొమ్మలు దహనం చేశారు. సంగారెడ్డి పట్టణంలో ర్యాలీ నిర్వహించి కొత్తబస్టాండ్ వద్ద, మెదక్లోని పోస్టాఫీిస్ చౌరస్తా వద్ద సీపీఐ(ఎం)ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన చేపట్టారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్లో నిరసన తెలిపారు. సీపీఐ(ఎం), సీపీఐ, సీపీఐ ఎంఎల్ మాస్లైన్ ఆధ్వర్యంలో మహబూబ్నగర్లోని తెలంగాణ చౌరస్తాలో ధర్నా నిర్వహించారు. జోగులాంబ గద్వాల, వనపర్తి, నాగర్ కర్నూల్, నారాయణపేట జిల్లా కేంద్రాల్లో సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు.
ఇరాన్పై అమెరికా దాడిని ప్రజాస్వామ్య వాదులు ఖండించాలని, ట్రంప్ యుద్ధ పిశాచి అని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి, పోతినేని సుదర్శన్ అన్నారు. వామపక్షాల ఆధ్వర్యంలో నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలంలోని యాద్గార్పల్లి వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ట్రంప్ దుర్మాగాన్ని ఖండించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంసీపీఐయు రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వస్కుల మట్టయ్య, సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు డబ్బికార్ మల్లేష్ పాల్గొన్నారు. నూతనకగ్ మండలం కేంద్రంలో ట్రంప్ దిష్టిబొమ్మ దహనం చేశారు. నాంపల్లి మండల కేంద్రంలో సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని స్థానిక వాణిజ్య భవన్ సెంటర్ సెంటర్లో వామపక్షాల ఆధ్వర్యంలో ట్రంప్ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఖమ్మం నగరం ఇందిరానగర్ సెంటర్లో సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో ట్రంప్ దిష్టిబొమ్మ దహనం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో వామపక్ష పార్టీల నాయకులు ర్యాలీ చేపట్టి ధర్నా నిర్వహించారు. కరీంనగర్, సిరిసిల్ల సహా పలు ప్రాంతాల్లో సీపీఐ(ఎం), సీపీఐ, సీపీఐ(ఎంఎల్) పార్టీల ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. సిరిసిల్ల టౌన్లోని అంబేద్కర్ చౌక్ వద్ద నాయకులు నిరసన తెలిపారు.
ఇరాన్పై దాడులకు ఖండన
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES