– అధికారుల తీరుతో జీపీ ఆదాయానికి
– గండి పడుతున్నదని ఆగ్రహం
నవతెలంగాణ-ఘట్కేసర్
ఘట్కేసర్ మండల పరిధిలోని ఎదులాబాద్ గ్రామంలో రాష్ట్ర ఎంపీపీల ఫోరం అధ్యక్షులు, ఘట్కేసర్ ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి గ్రామ పంచాయతీలోని రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అధికారులు చూసి చూడనట్లుగా వ్యవహరించడంతో గ్రామపంచాయతీ ఆదాయానికి భారీగా గండి పడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనుమతులకు విరుద్ధంగా వందల సంఖ్యలో ఇండ్ల నిర్మాణాలు జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడంలేదన్నారు. ఇకనైనా అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకొని గ్రామ అభివద్ధికి ప్రతి ఒక్కరూ తోడ్పడాలని తెలిపారు.