Thursday, June 26, 2025
E-PAPER
Homeఖమ్మంకార్మికులకు ఉరి తాళ్ళుగా మారనున్న లేబర్ కోడ్ లు..

కార్మికులకు ఉరి తాళ్ళుగా మారనున్న లేబర్ కోడ్ లు..

- Advertisement -

సీఐటీయూ నాయకులు పిట్టల అర్జున్
నవతెలంగాణ – అశ్వారావుపేట
: నాటి కార్మికుల చట్టాల స్థానంలో ప్రస్తుత పాలకులు అమలు చేయనున్న లేబర్ కోడ్ కార్మికులకు ఉరి తాళ్ళుగా మారనున్నాయి అని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు పిట్టల అర్జున్ అభిప్రాయపడ్డారు. కార్మిక చట్టాలు అమలు చేయాలని,పారిశ్రామిక వేత్తలు లాభాలు కోసమే కార్మిక వర్గాన్ని ఆదునిక బానిసలుగా తయారు చేసేందుకే నాలుగు లేబర్ కోడ్ లను కేంద్ర ప్రభుత్వం తీసుకు వస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు. జులై 9 న జరిగే దేశవ్యాప్త సమ్మెలో భాగంగా బుధవారం మధ్యాహ్న భోజన వర్కర్స్ యూనియన్ మండల కమిటీ ఆధ్వర్యంలో ఎంఈఓ ప్రసాదరావుకు సమ్మె నోటీసులు  అందజేసారు. 

ఈ సందర్భంగా అర్జున్ మాట్లాడుతూ కార్మిక చట్టాలను అమలు చేయాలని కార్మిక వర్గం ఆందోళన చేస్తుంటే అవి పట్టించుకోకుండా కార్మికుల హక్కులు కాలరాసే లేబర్ కోడ్ లను తీసుకువచ్చి కేంద్ర ప్రభుత్వం కార్మిక వర్గాన్ని భయబ్రాంతులకు గురి చేస్తుందని అన్నారు.కేంద్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేసే స్కీం వర్కర్స్ మధ్యాహ్న భోజనం లాంటి కార్మికులను ఈపీఎఫ్,ఈఎస్ఐ లాంటివి ఈ లేబర్ కోడ్లు ల్లో అనుమతించక పోవడం చాలా అన్యాయమని అన్నారు. కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న హక్కులు నిలబెట్టుకునేందుకు కార్మికులు సమిష్టిగా చేసే ఏ చర్య నైన నేరం కిందకు వచ్చేటట్లు ఈ కోడ్ లలో చేర్చారని ఈ చర్యలు కార్మిక వర్గానికి ఉరి తాళ్ళు గా మిగులు తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు సీత,పద్మ రాములమ్మ,కనక శిరీష,రమాదేవి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -