నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నివాసానికి కేంద్రమంత్రి పీయూష్గోయల్ వెళ్లారు. బంజారాహిల్స్లోని సీఎం ఇంటికి మర్యాదపూర్వకంగానే వెళ్లినట్టు సమాచారం. ఇటీవల సీఎం రేవంత్రెడ్డి ఢిల్లీ వెళ్లినప్పుడు వ్యక్తిగతంగా కేంద్రమంత్రిని ఇంటికి రావాలని సీఎం ఆహ్వానించారు. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి రాష్ట్ర పర్యటనకు వచ్చిన కేంద్రమంత్రి నేరుగా సీఎం ఇంటికి వెళ్లారు. ఈ సందర్భంగా వారిరువురూ కేంద్ర, రాష్ట్ర రాజకీయాలతో పాటు రాష్ట్రాభివృద్ధిపైనా చర్చించారు. ఈ చర్చల్లో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు, సీఎం రాజకీయ సలహాదారు వేం నరేందర్రెడ్డి కూడా పాల్గొన్నారు.