- Advertisement -
– బాల్కొండ ఎస్ఐ బి.నరేష్
నవతెలంగాణ – బాల్కొండ : డ్రగ్స్ నిర్మూలనలో యువత భాగస్వామ్యం కావాలని బాల్కొండ ఎస్ఐ బి.నరేష్ అన్నారు. మాదకద్రవ్యాల నిర్మూలన దినోత్సవం లో భాగంగా మండల కేంద్రంలో గురువారం 2 కె రన్, భారీ ర్యాలీ నిర్వహించి విద్యార్థులచే ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఎస్ ఐ మాట్లాడుతూ .. మాదక ద్రవ్యాల బారిన పడిన విద్యార్థుల జీవితాలు నరక ప్రాయంగా ఉంటాయని, జీవితంలో సర్వస్వం కోల్పోవలసి వస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి బట్టు రాజేశ్వర్, అన్ని విద్యాసంస్థల ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -