Friday, June 27, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పట్టణాభివృద్ధికి ప్రతి ఒక్కరు సహకరించాలి 

పట్టణాభివృద్ధికి ప్రతి ఒక్కరు సహకరించాలి 

- Advertisement -

ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి 
నవతెలంగాణ -పరకాల 

పరకాల పట్టణాభివృద్ధికి ప్రతి ఒక్కరు సహకరించాలని ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డిఅన్నారు. గురువారం పరకాల పట్టణంలో టియుఎఫ్ఐడిసి నిధులతో జరుగుతున్న పనులను అధికారులతో కలిసి ఎమ్మెల్యే  పరిశీలించారు. అనంతరం సీఎంఎస్ గోదాం కాలనీ, యూనియన్ బ్యాంక్ ప్రాంతం, బస్టాండ్ పరిసర తదితర ప్రాంతాలను పరిశీలించారు. డిపిఆర్ కి   అనుగుణంగా పనులను చేపట్టాలని అధికారులను ఆదేశించారు.పరకాల మున్సిపాలిటీని సుందరీకరణ చేసి అభివృద్ధిలో ముందు ఉంచాలని,మున్సిపల్ పరిధిలో అభివృద్ది పనులను సమన్వయం చేస్తూ ముందుకెళ్లాలన్నారు.మున్సిపాలిటీ పరిధిలో పెండింగ్‌లో ఉన్న పనులను వెంటనే పూర్తి చేయడంతో పాటు, కొత్త అభివృద్ధి పనులను ప్రణాళికా బద్ధంగా చేపట్టాలని ఎంఎల్ఏ అధికారులను ఆదేశించారు.కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం మున్సిపాలిటీల అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేస్తుందని తెలిపారు. ప్రజలకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా అధికారులు క్షేత్రస్థాయిలో పని చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కడారి సుష్మ, ఆర్డిఓ డాక్టర్ కే నారాయణ, ఎమ్మార్వో విజయలక్ష్మి, ఇంజనీరింగ్ అధికారులు, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు కొయ్యడ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -