Saturday, June 28, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్విలేఖరిపై దాడి.. నిందితులు కోర్టులో హాజరు

విలేఖరిపై దాడి.. నిందితులు కోర్టులో హాజరు

- Advertisement -

నవతెలంగాణ – తాడ్వాయి
ములుగు జిల్లా తాడ్వాయి మండలం నార్లపూర్  గ్రామానికి చెందిన చల్లగొండ శ్రీకాంత్ ఆంధ్రజ్యోతి పత్రిక విలేఖరిపై ఈనెల 24న నార్లాపూర్ గ్రామానికి చెందిన  తాండాల శ్రీను, మొక్క శ్రీనివాస్, బొప్ప వినోద్, ఎనగంటి సాయి కృష్ణ, సంకే శ్రావణ్ లు దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఈ ఐదుగురు వ్యక్తులను తాడ్వాయి పోలీసులు శుక్రవారం ఉదయం 8 గంటలకు విచారణ చేపట్టారు. అనంతరం అరెస్టు చేశారు. ఈ క్రమంలో కోర్టులో మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిచారు. ఇందుకు సంబంధించిన తీర్పు ఇంకా తెలియరాలేదు. వివరాలు త్వరలోనే తెలిసే అవకాశం ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -