Saturday, June 28, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంగిగ్‌ కార్మికుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం

గిగ్‌ కార్మికుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం

- Advertisement -

వారి కోసం వెల్ఫేర్‌ బోర్డు ఏర్పాటు
త్వరలోనే చట్టం తేబోతున్నాం : వివేక్‌ వెంకటస్వామి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

భారత్‌ జోడో యాత్రలో రాహుల్‌గాంధీ ఇచ్చిన హామీ మేరకు గిగ్‌ కార్మికుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందనీ, వారి కోసం వెల్ఫేర్‌ బోర్డు ఏర్పాటు చేయడంపై ఆలోచిస్తున్నామని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్‌ వెంకటస్వామి తెలిపారు. త్వరలోనే రాష్ట్రంలోని నాలుగున్నర లక్షల గిగ్‌ కార్మికుల కోసం ఒక చట్టం కూడా చేయబోతున్నామని తెలిపారు. శుక్రవారం హైదరాబాద్‌లోని సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. గిగ్‌ వర్కర్ల కోసం ఇప్పటికే రాజస్తాన్‌, కర్నాటక రాష్ట్రాల్లో చట్టాలున్నాయని గుర్తుచేశారు. గిగ్‌ వర్కర్ల హక్కుల అమలు చట్టం రూపకల్పన కోసం పబ్లిక్‌ డొమైన్‌లో చర్చ పెట్టగా 66 సలహాలొచ్చాయన్నారు. ఇటు గిగ్‌ వర్కర్లతోనూ, అటు యాజమాన్యాలతోనూ చర్చించి మెరుగైన చట్టాన్ని రూపొందిస్తామని హామీనిచ్చారు. గిగ్‌ వర్కర్లు సరఫరా చేసే ఉత్పత్తులపై ఒకటెండ్రు శాతం సెస్‌ వసూలు చేసి బోర్డు ద్వారా వారి సంక్షేమం కోసం ఖర్చుచేయడంపై కసరత్తు చేస్తున్నామని తెలిపారు. వారికి కనీస వేతనం దక్కేలా, సమాజంలో గుర్తింపు దక్కేలా చట్టంలో రూపొందిస్తామని హామీనిచ్చారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -