Saturday, June 28, 2025
E-PAPER
Homeతాజా వార్తలుకష్టపడ్డ కార్యకర్తలకే పార్టీలో గుర్తింపు: మంత్రి శ్రీధర్ బాబు

కష్టపడ్డ కార్యకర్తలకే పార్టీలో గుర్తింపు: మంత్రి శ్రీధర్ బాబు

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు/కాటారం : కాంగ్రెస్ పార్టీలో క్షేత్రస్థాయి నుండి కష్టపడి పని చేసే, ప్రజాభిమానం కలిగిన నాయకులకు, కార్యకర్తలకు తగిన గుర్తింపు లభిస్తుందని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు అన్నారు. శుక్రవారం కాటారం, మాలహర్ మండలంలోని తాడిచర్ల గ్రామంలో జరిగిన కాంగ్రెస్ పార్టీ సంస్థాగత సన్నాహక సమావేశానికి ముఖ్య అతిథిగా ఆయన హాజరయ్యారు. ఈ క్రమంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఐత ప్రకాష్ రెడ్డి, నియోజకవర్గ అబ్జర్వర్ లింగాజీ, పరిశీలకులు కూడా చైర్మన్ వెంకట్రామిరెడ్డిలు కూడా హాజరైయ్యారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ.. పదవుల కోసం వెంపర్లాడాల్సిన అవసరం లేదని అన్నారు. పదవులు లేకుండా కార్యకర్తలు పార్టీ కోసం పని చేయాలని తెలిపారు.

కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు ప్రజలకు క్షేత్రస్థాయిలో వివరించాలన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో పార్టీ నిర్దేశించిన వ్యక్తిని గెలిపించే విధంగా కార్యకర్తలు, నాయకులు కృషి చేయాలని, పార్టీకి విరుద్ధంగా పోటీ చేసే వారిని సహించే ప్రసక్తి లేదని సున్నితంగా హెచ్చరించారు. పార్టీని గ్రామస్థాయి నుండి పటిష్టం చేసేందుకు ఏఐసీసీ అధ్యక్షులు మల్లి కార్జున ఖర్గే ప్రత్యేక ప్రణాళికతో సంస్థాగత ఎన్ని కల కార్యాచరణ రూపొందించారని, అదే అమలు చేస్తున్నారని తెలిపారు. అర్హులైన, ఆశావాహులను ఎంపిక చేస్తామన్నారు. పార్టీలో కష్టపడి పనిచేసే వారికి పదవులు లేదా స్థానిక సంస్థల ఎన్నికలలో పోటీ చేసేందుకు అవకాశం ఉంటుందని ఈ సందర్బంగా గుర్తు చేశారు.

మల్హర్ మండలంలో త్వరలోనే 132 కెవి సబ్ స్టేషన్, సిసి రోడ్లు, అంగన్ వాడి, జీపీ భవనాలు తదితర అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లుగా తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఒక్కొక్కటి అమలు చేస్తోందన్నారు. ఈ కార్యక్ర మంలో తాడిచర్ల పిఏసిఎస్ చైర్మన్ ఇప్ప మొండయ్య, వైస్ ఛైర్మన్ ప్రకాష్ రావు, మాజీ ఎంపీపీ మలహల్ రావు, కాంగ్రెస్ పార్టీ ఎస్సిసెల్ అధ్యక్షుడు దండు రమేష్, మండల అధ్యక్షుడు బడితేల రాజయ్య, జిల్లా ఉపాధ్యక్షుడు అయిత రాజిరెడ్డి, సింగిల్ విండో డైరెక్టర్లు వొన్న తిరుపతి రావు, సంగ్గేం రమేష్, మత్స్యశాఖ జిల్లా డైరెక్టర్ జంగిడి శ్రీనివాస్, మహిళ అధ్యక్షురాలు కొండ రాజమ్మ, జిల్లా ఎస్టీ సెల్ ప్రధాన కార్యదర్శి సవేందర్, యూత్ అధ్యక్షుడు గడ్డం క్రాoతి, డివిజన్ యూత్ నాయకుడు రాహుల్, కాంగ్రెస్ నాయకులు జంగిడి సమ్మయ్య,జక్కుల వెంకటస్వామి యాదవ్, రాజు నాయక్, చిగురు సదయ్య, భోగే మల్లయ్య, ఇందారపు చెంద్రయ్య, జగన్ నాయక్, మావురపు వెంకన్న, కన్నూరి రవి, అశోక్, గాజుల శ్రీనివాస్ యాదవ్, రఘు, కేశారపు చెంద్రయ్య, ప్రభాకర్, రాజ సమ్మయ్య, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్త లు, మాజీ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -