Sunday, June 29, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్నకిలీ విత్తనాల పట్ల అప్రమత్తంగా ఉండాలి

నకిలీ విత్తనాల పట్ల అప్రమత్తంగా ఉండాలి

- Advertisement -

– రెండవ అదనపు న్యాయ ప్రథమ శ్రేణి న్యాయమూర్తి హరిక
నవతెలంగాణ – రాయపర్తి
నకిలీ విత్తనాల పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలని రెండవ అదనపు న్యాయ ప్రథమ శ్రేణి న్యాయమూర్తి హరిక అన్నారు. శనివారం మండల కేంద్రంలోని రైతు వేదికలో నకిలీ పత్తి విత్తనాలపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన న్యాయమూర్తి హరిక మాట్లాడుతూ.. గ్రామాల్లో అపరిచితులు సంచరిస్తూ ప్రభుత్వ ఆమోదం లేని నకిలీ విత్తనాలను మాయ మాటలు చెప్పి విక్రయిస్తారని తెలిపారు. ప్రభుత్వం ఆమోదం పొందిన షాపుల్లోనే విత్తనాలను కొనుగోలు చేయాలని రైతులకు సూచించారు. నకిలీ పత్తి విత్తనాలు వాడితే రైతులు ఆర్థికంగా నష్టపోవడంతో పాటు భూసారం నశించుతుందని హితబోధ చేశారు. నకిలీ విత్తనాలు అమ్ముతున్నట్లు తెలిస్తే పోలీసులకు లేదా వ్యవసాయ అధికారులకు సమాచారం ఇవ్వాలని ఉపోద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ శ్రీనివాస్, వరంగల్ న్యాయ సేవ అధికారిని రజనీ, వర్ధన్నపేట సీఐ కొమ్మూరి శ్రీనివాస రావు, ఎస్ఐ రాజేందర్, మండల వ్యవసాయ అధికారి వీరభద్రం తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -