– జాతీయ బాక్సింగ్ పోటీలు షురూ
హైదరాబాద్: రెండు సార్లు ప్రపంచ చాంపియన్, తెలంగాణ స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్ జాతీయ బాక్సింగ్ చాంపియన్షిప్స్లో శుభారంభం చేసింది. హైదరాబాద్లో శనివారం ఆరంభమైన సీనియర్ నేషనల్స్లో మహిళల 51 విభాగంలో తెలంగాణ తరఫున బరిలోకి దిగిన నిఖత్ జరీన్ తొలి రౌండ్లో ఉత్తరప్రదేశ్ బాక్సర్ రాశి శర్మపై 4-1తో ఘన విజయం సాధించింది. లోకల్ అభిమానుల నడుమ రింగ్లో పదునైన పంచ్లు సంధించిన నిఖత్ జరీన్ పెద్దగా శ్రమపడకుండానే ముందంజ వేసింది.
యువ అథ్లెట్లకు స్ఫూర్తి: హైదరాబాద్లో జాతీయ, అంతర్జాతీయ టోర్నమెంట్ల నిర్వహణతో యువ అథ్లెట్లలో స్ఫూర్తి, ఉత్తేజం తీసుకొస్తున్నామని తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ (శాట్జ్) చైర్మెన్ కే. శివసేన రెడ్డి అన్నారు. మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్, శాట్జ్ వీసీ,ఎండీ సోనీ బాలదేవితో కలిసి శనివారం సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో జాతీయ బాక్సింగ్ పోటీలను శివసేన రెడ్డి ప్రారంభించారు. జాతీయ బాక్సింగ్ సమాఖ్య, తెలంగాణ బాక్సింగ్ సంఘం ప్రతినిధులు, శాట్జ్ అధికారులు, క్రీడాకారులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
నిఖత్ జరీన్ శుభారంభం
- Advertisement -
- Advertisement -