Monday, June 30, 2025
E-PAPER
Homeతాజా వార్తలుప్రయాణికులకు ఆర్టీసీ గుడ్ న్యూస్

ప్రయాణికులకు ఆర్టీసీ గుడ్ న్యూస్

- Advertisement -

న‌వ‌తెలంగాణ – హైద‌రాబాద్: ప్రయాణికులకు ఆర్టీసీ గుడ్ న్యూస్ తీసుకువచ్చింది. ఈ రోజు నుంచి జరిగే గోల్కొండ జగదాంబిక బోనాలను దృష్టిలో ఉంచుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రత్యేక బస్సులను ప్రకటించింది. 24 ప్రాంతాల నుండి గోల్కొండ వైపు మొత్తం 75 ప్రత్యేక బస్సులను ప్రకటించారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి పది బస్సులు, కాచిగూడ రైల్వే స్టేషన్, పటాన్‌చెరు నుండి ఒక్కొక్కటి ఐదు బస్సులు షెడ్యూల్ చేశారు. ఈసీఐెల్ ఎక్స్ రోడ్స్, దిల్‌సుఖ్ నగర్, రాజేంద్ర నగర్, రామ్ నగర్, ఉప్పల్, కెపిహెచ్‌బి కాలనీ, ఓల్డ్ బోయిన్‌పల్లి , మల్కాజ్‌గిరి నుండి నాలుగు బస్సులు షెడ్యూల్ చేశారు. చార్మినార్ నుండి ఆరు బస్సులు , మెహదీపట్నం నుండి ఎనిమిది బస్సులు, హయత్ నగర్ కూకట్‌పల్లి నుండి రెండు బస్సులు స్పెషల్‌గా నడువనున్నాయి. అంతేకాకుండా బోనాలు భక్తులకు హెల్ప్ డెస్క్ ఏర్పాటు అయ్యింది. భక్తులను ఆలయానికి తీసుకెళ్లడానికి మహాత్మా గాంధీ బస్ స్టేషన్, మెహదీపట్నం , గోల్కొండలలో హెల్ప్ డెస్క్‌లు ఉన్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -