Tuesday, July 1, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్వన మహోత్సవానికి వేళాయె.!

వన మహోత్సవానికి వేళాయె.!

- Advertisement -

లక్ష్యానికి అనుగుణంగా నర్సరీల్లో మొక్కల పెంపకం..
మొదటి విడతలో 63.750 వేల మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు
నవతెలంగాణ – మల్హర్ రావు
: వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. మొక్కలు నాటేందుకు అవసరమైన గుంతలను ఉపాధిహామీ కూలీలతో తవ్వించేందుకు సిద్ధమైయ్యారు. మండలంలో సకాలంలో వర్షాలు కురిస్తే జూలై మొదటి వారంలో వన మహోత్సవం నిర్వహించేందుకు సన్నద్ధమవుతున్నారు.

1.80 లక్షల మొక్కలు లక్ష్యం..

మండలంలోని 15 గ్రామపంచాయతీల్లో వన మహోత్సవంలో భాగంగా 1.80 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్ణయించారు. ఇందుకు అనుగుణంగా నర్సరీల్లో మొక్కలు పెంచుతున్నారు. ప్రస్తుతం మొక్కలను నర్సరీల్లో అందుబాటులో ఉంచారు. నర్సరీల్లో జామ, నిమ్మ, బొప్పాయి, కరివేపాకు, మునగ తదితర పండ్ల మొక్కలతో పాటు గులాబీ, మందార, గన్నేరు తదితర పూలమొక్కలను పెంచుతున్నారు. ఆయా గ్రామాల్లో మొదటి విడతలో 63.750 వేల మొక్కలు నాటేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. పీఆర్, ఆర్అండ్ బీ రోడ్లకు ఇరువైపుల స్థలాలు, ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థల ఆవరణల్లో మొక్కలు నాటాలని నిర్ణయించారు. మొక్కలు నాటేందుకు ఉపాధిహామీ కూలీలతో గుంతలు తవ్వకాలు చేపట్టేందుకు సన్నద్ధమైయ్యారు.

ప్రతీ ఇంటికి మొక్కలు పంపిణీ: ఉపాది ఎపిఓ..హరీష్ 

ప్రభుత్వ ఆదేశాల మేరకు వచ్చేనెలలో వనమ హోత్సవం కార్యక్రమం ప్రారంభించేందుకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేశాం. గ్రామాల వారీగా నాటే మొక్కల లక్ష్యం మేరకు గుంత లు తవ్వే పనులు త్వరలో ప్రారంభిస్తాం.ప్రతీ ఇంటికి ఆరు మొక్కలు పంపిణీ చేసేందుకు చర్యలు చేపట్టాం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -