Tuesday, July 1, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఉద్యమకారులకు ఇచ్చిన హమీలు నెరవేర్చాలి

ఉద్యమకారులకు ఇచ్చిన హమీలు నెరవేర్చాలి

- Advertisement -

ఉద్యమకారుల శాంతియుత దీక్ష లో ఉద్యమకారుల డిమాండ్
నవతెలంగాణ – మల్హర్ రావు
: తెలంగాణ ఉద్యమకారులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను వెంటనే అమలు పరచాలని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం భూపాలపల్లి జిల్లా మల్హర్ రావు మండల కేంద్రమైన తాడిచెర్లలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు శాంతియుత దీక్ష కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఉద్యమ కారులు మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఉద్యమ కారులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు.

ఈ ప్రభుత్వం ఏర్పడి 17 నెలలు గడుస్తున్నా తెలంగాణ ఉద్యమకారుల హామీలను నెరవేర్చకుండా జాప్యం చేయడం దారుణమన్నారు. రాష్ట్ర సాధన కోసం దశాబ్దాల కాలం పాటు తమ వృత్తులను, వ్యాపారులను పక్కన పెట్టి నేడు ఆర్థికంగా శారీరకంగా నష్ట పోయి అనేక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా తెలంగాణ ఉద్యమకారులను గుర్తించేందుకు ప్రభుత్వం ప్రత్యేక కమిటీ నియమించి ఝార్ఖండ్ తరహాలో సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి ఉద్యమకారులకు పెన్షన్లు బస్సు, ట్రైన్, హెల్త్ కార్డులు తదితర వాటిని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ శాంతియుత దిక్షా శిబిరానికి బిజెపి మంథని అసెంబ్లీ కన్వీనర్ మల్కా మోహన్ రావు హజరై ఉద్యమకారులకు సంఘీభావం తెలిపారు.
ఈ కార్యక్రమంలో టియూఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పోలోజు సత్యనారాయణ, జిల్లా ప్రధాన కార్యదర్శి ముడితనపెల్లి ప్రభాకర్, మండల అధ్యక్షులు బూడిద సతీష్, ప్రదాన కార్యదర్శి బండారి శంకరయ్య,మైనార్టీ సెల్ అధ్యక్షులు షేక్ చాంద్ పాషా, బడితెల వెంకటస్వామి, కోంఢ్ర సారయ్య, చొప్పరి రాజు, ముద్రవేణి కిష్టయ్య, గడ్డం సమ్మక్క, బండారి యశోద, జునగరి పద్మ,అక్కల రాజేశ్వరి, మద్దెల విజయ, మీనుగు నాగేష్, తోకల గట్టయ్య, ఆకుల సదానందం, రేకుంట్ల గోవర్ధన్. చల్ల మొండి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -