- Advertisement -
నవతెలంగాణ – జన్నారం : మండలం గాంధీనగర్ లోని ప్రభుత్వ ప్రైమరీ స్కూల్ విద్యార్థులకు పీ సీ ఆర్ ( పూర్ణచందర్రావు ) ఫౌండేషన్ ఆధ్వర్యంలో సోమవారం విద్యార్థులకు బ్యాగులు పంపిణీ చేశారు. ఫౌండేషన్ వ్యవస్థాపకులు ముడుగు ప్రవీణ్ మాట్లాడుతూ.. 30మంది విద్యార్థులకు ఫౌండేషన్ ద్వారా బ్యాగులు పంపిణీ చేశామన్నారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు రాగుల శంకర్, ప్రశాంత్,మూల భాస్కర్ గౌడ్, షార్పొద్దీన్, దుర్గం తిరుపతి, స్కూల్ హెడ్ మాస్టర్ నగురు సతీష్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
- Advertisement -