- Advertisement -
నవతెలంగాణ-రామారెడ్డి : మండలంలోని ఇసన్నపల్లి (రామారెడ్డి) లో వెలసిన శ్రీ కాలభైరవ స్వామి ఆలయాన్ని గురువారం హైకోర్టు జడ్జ్ గిరిజాతోపాటు కామారెడ్డి సీనియర్ సివిల్ జార్జ్ నాగరాణి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ పూజారులు పూర్ణకుంభంతో స్వాగతం పలుకగా, ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కలు తీర్చుకున్నారు. ఆలయ కమిటీ వారికి శాలువాలతో సన్మానించి, స్వామి వారి జ్ఞాపక తో పాటు తీర్థ ప్రసాదాలను అందజేశారు. కార్యక్రమంలో జూనియర్ అసిస్టెంట్ లక్ష్మణ్, ఆలయ పూజారులు శ్రీనివాస్ శర్మ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -