నవతెలంగాణ – కామారెడ్డి : కామారెడ్డి జిల్లాలో 10 ఎస్సైలను వివిధ పోలీస్ స్టేషన్లకు అటాచ్డ్ చేస్తూ జిల్లా ఎస్పీ ఎం రాజేష్ చంద్ర ఉత్తర్వులు జారీ చేశారు. అటాచ్లో భాగంగా వీఆర్లో ఉన్న నలుగురికి పోస్టింగ్ ఇచ్చారు. ఇద్దరు ఎస్సైలను వీఆర్కు అటాచ్ చేశారు. వీఆర్లో ఉన్న నవీన్ చంద్రను జుక్కల్కు అటాచ్ చేశారు. రాఘవేంద్రను నస్రుల్లాబాద్ ఎస్సైగా అటాచ్ చేశారు. అరుణ్ కుమార్ను పెద్ద కొడప్గల్గా ఎస్సైగా అటాచ్ చేశారు.
రాజారాంనకు కామారెడ్డి టౌన్ ఎస్ఐగా అటాచ్ చేశారు. నస్రుల్లాబాద్ ఎస్సై పని చేసిన లావణ్యను రామారెడ్డికి అటాచ్ చేశారు. రాజంపేట ఎస్సై పుష్పరాజ్ను సదాశివనగర్ ఎస్సైగా అటాచ్ చేశారు. సదాశివనగర్ ఎస్సై రంజిత్ను దేవునిపల్లి పీఎస్కు అటాచ్ చేశారు. జుక్కల్ ఎస్సై భువనేశ్వర్ను దేవునిపల్లి-2 ఎస్సైగా అటాచ్ చేశారు. దేవునిపల్లి ఎస్సై రాజు, పెద్ద కొడప్గల్ ఎస్సై మహేందర్ లను వీఆర్కు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
10 మంది ఎస్ఐలను వివిధ పోలీస్ స్టేషన్ లకు అటాచ్ చేసిన ఎస్పీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES