- Advertisement -
నవతెలంగాణ – జన్నారం
జన్నారం మండలం పోన్కల్కి చెందిన దూ మల్ల రాజ్ కుమార్ వైద్య ఖర్చుల నిమిత్తం గల్ఫ్ కార్మికుల సంక్షేమ సమితి, పోన్కల్, అక్క పళ్లి గుడా ఉమ్మడి గ్రామాల సభ్యులు ఆర్థిక సాయం అందజేశారు. సోమవారం రాజ్ కుమార్ కుటుంబ సభ్యులను కలిసి రూ.15 వేలు అందించారు. ఈ కార్యక్రమంలో వ్యవస్థాపకుడు రాజుగౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్ మహమ్మద్ అలీం, మండల ప్రధాన కార్య దర్శి ఎల్లయ్య మర్రిపల్లి అంజన్న తిరుపతి తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గల్ఫ్ కార్మికుల కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాల ఆదుకోవాలని అన్నారు. బాధితుడు దూమల్ల రాజు కు అండగా నిలవాలని కోరారు. దాతలు ముందుకు వచ్చి సహకరించాలని కోరారు..
- Advertisement -