- Advertisement -
నవతెలంగాణ – జన్నారం
కురుస్తున్న వర్షాలకు మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జన్నారం ఎస్సై గొల్లపల్లి అనూష సూచించారు. సందర్భంగా సోమవారం ఆమె మాట్లాడుతూ.. మండలంలోని పలు గ్రామాల్లో భారీ వర్షాలు పడుతున్నాయన్నారు. ఈ నేపథ్యంలో గోదావరి నదితో పాటు వాగులు, వంకలు, ఒర్రెలు వరద నీటితో ప్రవహించే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నారు. ప్రజలు, పశుకాపరులు అటువైపుగా వెళ్లవద్దన్నారు. అత్యవసరమైతే తమకు సమాచారం ఇవ్వాలన్నారు. ప్రజలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
- Advertisement -