– మండలానికి 4 నుంచి ఆరుగురు లైసెన్స్డ్ సర్వేయర్లు
– ఈనెల 27న అర్హత పరీక్ష
– ఐదు నక్షా గ్రామాల్లో రీసర్వే పూర్తి: రెవెన్యూ, హౌసింగ్, ఐఅండ్పీఆర్ మంత్రి పొంగులేటి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రెవెన్యూ వ్యవస్ధను మరింత బలోపేతం చేసి భూ సమస్యలపై సామాన్యులకు మెరుగైన సేవలందించడానికి వీలుగా ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒక జీపీఓ, భూ విస్తీర్ణాన్ని బట్టి ప్రతి మండలానికి నలుగురు నుంచి ఆరుగురు ల్యాండ్ సర్వేయర్లను నియమించబోతున్నట్టు రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, ఐఅండ్పీఆర్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ప్రకటించారు. ఈ నెల 27న శిక్షణ పొందిన లైసెన్స్డ్ సర్వేయర్లకు తుది పరీక్ష నిర్వహిస్తామనీ, 28, 29 తేదీల్లో జేఎన్టీయూ ఆధ్వర్యంలో ల్యాబ్ ప్రాక్టికల్ పరీక్ష నిర్వహిస్తామని వెల్లడించారు. ఆగస్టు 12న తుది ఫలితాలు ప్రకటిస్తామని తెలిపారు. ఉత్తీర్ణులైన వారికి 40 రోజుల పాటు అప్రెంటిస్ శిక్షణ ఉంటుందని తెలిపారు. శుక్రవారం హైదరాబాద్లో రెవెన్యూ ఉన్నతాధికారులతో మంత్రి పొంగులేటి సమీక్ష నిర్వహించారు. భూ భారతి చట్టంలో రిజిస్ట్రేషన్ సమయంలో సర్వే మ్యాప్ తప్పనిసరి చేసిన నేపథ్యంలో అందుకు అవసరమైన సర్వేయర్లను అందుబాటులోకి తీసుకురావాలన్న లక్ష్యంతో దరఖాస్తులను ఆహ్వానించామన్నారు. మొత్తం పదివేల మంది దరఖాస్తు చేసుకున్నారనీ, తొలివిడతలో ఏడు వేల మందికి 33 కేంద్రాల్లో మే 26న శిక్షణ ప్రారంభించామన్నారు. ఈ నెల 26తో 50 రోజుల శిక్షణ పూర్తికాబోతున్నదన్నారు. మిగిలిన మూడువేల మందికి ఆగస్టు రెండో వారం నుంచి శిక్షణ ప్రారంభిస్తామని చెప్పారు. గత పదేండ్లలో సర్వే విభాగం పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందన్నారు. రెవెన్యూ సేవలను సామాన్యులకు అందుబాటులోకి తేవాలన్న లక్ష్యంలో భాగంగా ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒక జీపీవోను నియమి స్తున్నామని తెలిపారు. వీఆర్వో, వీఆర్ఏ అవకాశం కల్పించాలన్న ఉద్దేశంతో అర్హత పరీక్ష నిర్వహించగా 3,554 మంది ఎంపికయ్యారని తెలిపారు. మరోసారి అవకాశం కల్పించాలన్న రెవెన్యూ సంఘాల అభ్యర్ధన మేరకు ఈనెల 27న మరోసారి వారికి అర్హత పరీక్ష నిర్వహిస్తున్నామన్నారు.
ఐదు నక్షా గ్రామాల్లో రీసర్వే పూర్తి
రాష్ట్రంలో నక్షా లేని 413 గ్రామాలను గుర్తించామనీ, ప్రయోగాత్మకంగా ఐదు గ్రామాల్లో రీసర్వేను విజయవంతం చేశామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి తెలిపారు. నక్షాలేని గ్రామాలకు పరిష్కారం చూపాలన్న సీఎం రేవంత్రెడ్డి ఆదేశాలతో ముందుకెళ్తున్నామని చెప్పారు. గత ప్రభుత్వం నక్షాలేని గ్రామాలను విస్మరించిందని విమర్శించారు. పైలెట్ గ్రామాలైన మహబూబ్నగర్ జిల్లా గండీడ్ మండలం సలార్ నగర్లో 422 ఎకరాలు, జగిత్యాల్ జిల్లా భీర్పూర్ మండలం కొమ్మనాపల్లి ( కొత్తది) గ్రామంలో 626 ఎకరాలు, ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం ములుగుమడలో 845 ఎకరాలు, ములుగు జిల్లా వెంకటాపురం మండలం నూగురులో 502 ఎకరాలు, సంగారెడ్డి జిల్లా వట్పల్లి మండలం షాహిద్నగర్లో 593 ఎకరాలకు సర్వే పూర్తిచేశామని వివరించారు. మొత్తం ఐదు గ్రామాల్లోని 2988 ఎకరాల్లో చిన్న వివాదాలకు తావులే కుండా రైతుల సమక్షంలోనే క్షేత్రస్ధాయిలో భౌతికంగా ఈసర్వే పూర్తి చేశామని చెప్పారు. దీని వల్ల భూమి సమాచారం, పారదర్శకత, వివాద పరిష్కారం, భూ యాజ మాన్యంలో స్పష్టత వస్తుందన్నారు. ఫలితంగా రైతులు, గ్రామీణ భూ యజమానులకు ఎంతో ప్రయోజనం కలుగు తుందని చెప్పారు. ఈ సర్వే ఫలితాలను పరిగణనలోకి తీసుకొని మిగిలిన గ్రామాల్లో కూడా రీసర్వే నిర్వహించడానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
రెవెన్యూ గ్రామానికి ఒక జీపీవో
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES