- Advertisement -
నవతెలంగాణ – మద్నూర్ : జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే పిలుపు మేరకు చలో హైదరాబాద్ కు బిఆర్ఎస్ మండల నాయకులు తరలివెళ్లారు. ఈ క్రమంలో మండలాధ్యక్షులు బన్సి పటేల్, మండల ప్రధాన కార్యదర్శి గోవింద్ పటేల్, మాజీ సర్పంచులు రాజు పటేల్, ఎంకే పటేల్, బిఆర్ఎస్ మండల యువజన అధ్యక్షులు సచిన్ పటేల్, మండల యువ నాయకులు వాగు మారే మారుతి, ఇందిరా పార్క్ వద్ద జరిగే బీసీ పి ఎఫ్ ఆధ్వర్యంలో తలపెట్టిన బీసీల ధర్నా ఆందోళనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఇందిరా పార్క్ వద్ద నిర్వహించే ధర్నా విజయవంతానికి పెద్ద ఎత్తున తరలి వెళ్లినట్లు వారు తెలిపారు.
- Advertisement -