నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
పెండింగ్లో ఉన్న వికలాంగుల పెన్షన్ విడుదల చేయాలని కోరుతూ.. గురువారం యాదాద్రి భువనగిరి కలెక్టర్ కార్యాలయం ముందు వికలాంగుల హక్కుల జాతీయ వేదిక జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా గౌరవ అధ్యక్షులు మాటూరి బాలరాజు, జిల్లా అధ్యక్షుడు స్వరూపంగా ప్రకాష్ లు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం వికలాంగులకు ఇచ్చిన 6000 పెన్షన్ హామీని వెంటనే నిలబెట్టుకోవాలని, గత మూడు సంవత్సరాలుగా వికలాంగుల పెన్షన్ విడుదల చేయడంలో రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా ఉన్నాయని అర్హులైన వికలాంగులందరికీ పెండింగ్ పెన్షన్లను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపుల్లో ఐదు శాతం వాటా కేటాయించాలని డిమాండ్ కోరారు. వికలాంగుల స్వయం ఉపాధి కోసం కేటాయించిన రుణాల యూనిట్ల సంఖ్యను పెంచాలని డిమాండ్ చేశారు.
గతంలో దరఖాస్తు చేస్తున్న వికలాంగుకు రుణాలను కేటాయించకుండా వారిని మోసం చేయడం తగదని, వెంటనే గతంలో దరఖాస్తు చేసిన వికలాంగులు అందరికీ ఇలాంటి షరతులు లేకుండా రుణాలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సహాయ పరికరాలు అవసరం ఉన్న వికలాంగులందరికీ కేటాయించాలని కోరారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో నామినేటెడ్ పోస్టుల్లో వికలాంగులకు ఐదు శాతం కేటాయించాలని, లేనిపక్షంలో పెద్ద ఎత్తున వికలాంగులను సమీకరించి పోరాటం చేస్తామని హెచ్చరించారు. అనంతరం వివిధ సమస్యల పరిష్కరించాలని కోరుతూ కలెక్టరేట్ పరిపాలన అధికారి జగన్మోహన్ ప్రసాద్ కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బొల్లేపల్లి స్వామి, కోశాధికారి కొత్త లలిత, మహిళా నాయకురాలు కొండాపురం మనోహర, పార్వతి, ఉపాధ్యక్షుడు అంజయ్య, గడ్డం యాదగిరి, ఏర్పుల శివయ్య, నాయకులు లింగం నాయక్, శ్రీహరి, గిరిక లింగస్వామి, విజయ్, రంగ సంతోష్, వెంకటేశ్వర్లు, గోపి, వెంకటేష్ లు పాల్గొన్నారు.